ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, చిం తపట్లలో శుక్రవారం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెం దిన దొడ్డి అశోక్ (45) ఇందిరమ్మ ఇల్ల్లు రాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో తన ఇంట్లో సీలింగ్ ప్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందిరమ్మ ఇల్ల్లు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకొంటున్నట్లు తన చేతపై రాసి చనిపోయాడు. విషయం తెలుసుకొన్న గ్రామస్థులు, మృతుని బంధువులు పంచాయతీ కార్యాలయం ఎదుట మృతదేహాన్ని
ఉంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మృతునికి భార్య, ముగ్గురు పెండ్లికాని కు మార్తెలు ఉన్నారు. ఎసిపి రాజు, సిఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు సంఘటనా స్థలానికి చేరుకొని మృతునికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చా రు. దీంతో వారు ఆందోళన విరమించారు. కాగా, అశోక్ మరణం ఆత్మహ త్య కాదని బిఆర్ఎస్ యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి ఆరోపించా రు. బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్తో కలిసి ఆయన మృతదేహాన్ని సందర్శించి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.