- Advertisement -
మనతెలంగాణ/యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో సైదాపురం గ్రామానికి చెందిన రవి (38) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ పై అంతస్థులోనే ఎన్నో ఏళ్లుగా ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు.
- Advertisement -