Saturday, May 3, 2025

ప్రాణం తీసిన అతివేగం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా బొంగుళూరు సమీపంలో ఓఆర్‌ఆర్ ఎ గ్జిట్ నంబర్ 12 వద్ద కారు బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాచారం మండలం, నల్లవెల్లి గ్రామానికి చెందిన దేరంగుల తిరుమలేష్ (35), బ్రీజాకార్‌లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి బొంగులూరు ఎగ్జిట్ 12 వద్దకు అతివేగంగా వస్తున్నాడు. కారు అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరుమలేష్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News