Tuesday, June 17, 2025

ఉరి వేసుకొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

చేర్యాల: మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వేచరేణి గ్రామంలో చోటు చేసుకుంది. చేర్యాల ఎస్‌ఐ బాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాదాసు యాదగిరి (30) గత కొంత కాలంగా మద్యానికి బానిసై అప్పుల బాధతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. అతని భార్య మాదాసు స్రవంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News