- Advertisement -
ఫిరోజ్పూర్: ఈ మధ్యకాలంలో జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. అలాంటి ఓ దుర్ఘటనే పంజాబ్లోని ఫిరోజ్పూర్లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్కూల్ మైదానంలో హర్జీత్ సింగ్ అనే వ్యక్తి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో (Heart Attack) మరణించాడు. బ్యాటింగ్ చేస్తూ హర్జీత్ సిక్సు కొట్టాడు. ఆ తర్వాత పిచ్ మధ్యకు వెళ్తూ మధ్యలోనే అలసటతో కింద కూర్చున్నాడు. ఆ వెంటనే కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి క్రికెటర్లు పరిగెత్తుకు వచ్చి అతనికి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా, ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
.
- Advertisement -