Friday, June 13, 2025

భార్యతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి రైలు కింద పడిన భర్త

- Advertisement -
- Advertisement -

భార్య తనతో గొడవ పడిందనే మనస్థాపంతో ఓ వ్యక్తి తన నలుగురు చిన్నారులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హర్యానా లోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బీహార్‌కు చెందిన మనోజ్ మహతో (45)తన కుటుంబంతో హర్యానా లోని ఫరీదాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం భార్య ప్రియకు, అతడికి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మనోజ్ తమ నలుగురు పిల్లలు పవన్(10),కరు(9), మురళి (5). చోటు (3)లను పార్కుకు తీసుకెళ్తున్నామని చెప్పి వారిని తీసుకుని బయటకు వెళ్లాడు. చిన్నారులు కోరిన కూల్‌డ్రింక్స్, చిప్స్ కొనిపించి, వారు తిన్న తర్వాత ఇంటికి దగ్గరలో ఉన్న రైలు పట్టాల వైపు తీసుకెళ్లాడు. గోల్డెన్‌టెంపుల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై ఎదురుగా వస్తుండడం గమనించి ,

తన నలుగురు పిల్లలను గట్టిగా పట్టుకొని రైలు ముందు దూకేశాడు. రైలు వారిని ఢీకొనడంతో ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.చిన్నారులు తప్పించుకోవడానికి ప్రయత్నించినా, అతడు వారిని వదలకుండా పట్టుకున్నట్టు స్థానికులు తెలిపారు. స్థానికులు ఈ సంఘటన గురించి తెలియజేస్తూ ఓ వ్యక్తి పిల్లలను పట్టుకొని రైలు పట్టాల వైపు వెళ్తుండటం చూశామని కానీ, వాటిని దాటడానికి ప్రయత్నిస్తున్నారని అనుకున్నామని చెప్పారు. ప్రమాదాన్ని గ్రహించే లోపు ఆ వ్యక్తి పిల్లలతో కలిసి రైలు ముందుకు వెళ్లాడని పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. మృతుడి జేబులో అతడి భార్య ఫోన్ నెంబర్ ఉందని, భార్య తనను మోసం చేసిందన్న అనుమానంతోనే అతడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News