Monday, June 30, 2025

ప్రాణం తీసిన ‘బాట పంచాయితీ’

- Advertisement -
- Advertisement -

ఇరు వర్గాల మధ్య ‘బాట పంచాయితీ’ ఒక వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఏళ్లుగా దాయాదుల ఉన్న భూ పంచాయితీ వ్యక్తి మరణానికి కారణం అయింది. కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి, దౌల్తబాద్ ఎస్‌ఐ రవి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండల పరిధిలోని బండివాడకు చెందిన చౌహాన్ బాబు నాయక్, చౌహాన్ వెంకట్ నాయక్‌కు హన్మా నాయక్ తండాకు చెందిన ధనవత్ విజయ్ నాయక్, మాన్య నాయక్, వెంకటనాయక్, అజయ్ నాయక్, రవి నాయక్ గత కొన్నేళ్లుగా వ్యవసాయ పొలానికి వెళ్ళే దారి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం బాట విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో బాబు నాయక్ వర్గం చేసిన దాడిలో విజయ్ నాయక్ వర్గం వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో గాయపడ్డ విజయ్ నాయక్ వర్గం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బాబునాయక్, వెంకట్ నాయక్ తదితరులపై కేసు నమోదు చేశారు.

అనంతరం బాబు నాయక్ సైతం విజయ్ నాయక్ వర్గంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన అనంతరం బాబు నాయక్, అతని సోదరుడు వెంకట్ నాయక్, వారి కొడుకులతో కలిసి బైక్‌లపై దాదాపు రాత్రి 10 గంటల సమయంలో తమ తండాకు బయలుదేరారు. ఈ క్రమంలో హన్మ్యా నాయక్ తండా దగ్గర బాబు నాయక్, వెంకట్ నాయక్ ప్రయాణిస్తున్న బైక్‌లపై విజయ్ నాయక్ వర్గీయులైన దానవత్ జైపాల్ నాయక్, రాములు నాయక్, మాన్య నాయక్, రవి నాయక్, బడ్క్య నాయక్, వెంకట్ నాయక్ తదితరులు దారి కాసి కర్రలు, రాడ్ల తో దాడి చేశారు. ఈ దాడిలో బాబు నాయక్, అతని కొడుకు శ్రీరామ్‌కు తీవ్ర గాయాలతో త్రుటిలో తప్పించుకున్నారు. వెనుక వస్తున్న వెంకట్ నాయక్‌పై చేసిన దాడి చేయడంతో అతనికి తలపై తీవ్రంగా గాయాలు అయ్యాయి.

చికిత్స నిమిత్తం కొడంగల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో దాదాపు రాత్రి 1 గంటల సమయంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కొడంగల్ ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు బాబు నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్‌ఐ రవి గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News