హైదరాబాద్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. శుక్రవారం (జూన్ 27) విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు (Manchu Vishnu) మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయోత్సవంలో తనకు మాటలు రావడం లేదన్నారు. సినిమాకు మంచి స్పందన వస్తుందని.. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో ఇది ఇలాగే కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సినిమా వాళ్లకు కనిపించే దేవుళ్లు ప్రేక్షకులే అన్న విష్ణు.. తమ టీమ్ని ప్రేక్షకులు మనస్పూర్తిగా ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. ఈ విజయాన్ని ముందుగా తన కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తానని పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించగా.. ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటించారు. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎవిఎ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాకర్టీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన మంచు మనోజ్, తన అన్న తాను ఊహించిన దానికంటే గొప్పగా నటించారని కొనియాడారు. పలువురు ప్రొడ్యూసర్లు కూడా సినిమాను ప్రశంసించారు.