మావోయిస్టు అగ్రనేత హిడ్మా పేరుతో ఉన్న మ రో మావోయిస్టు నేత హిడ్మాను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఆయ న ఒరి స్సా లోని కోరాపుట్లో ఉండగా అరెస్టు చేశారు. అరెస్టయిన హిడ్మా నుంచి ఒక ఎకె-47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు, 117 డిటోనేటర్లు, గన్పౌడర్, రేడియో, క త్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జ రిగిన ఒక ప్రత్యే క ఆపరేషన్లో హార్డ్కోర్ మావోయిస్ట్ హిడ్మా అలియాస్ మో హన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జిల్లా ఎస్పీ రోహిత్వర్మ వె ల్లడించారు. బైపారీ గుడా పోలీస్స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామం సమీపంలోని దట్టమైన అ డవిలో హిడ్మాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పెటగుడా సమీపంలోని అ డవిలో సి పిఐ(మావోయిస్ట్) క్యాడర్ల కదలికల గురించి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా, కోరాపుట్ జిల్లా పోలీసులు, జిల్లా స్వచ్ఛంద బలగం (డివి ఎఫ్) సంయుక్తంగా ఒక ప్రత్యేక ఆపరేషన్ ను ప్రారంభించాయి.
ఈ ఆ పరేష న్లో డివిఎఫ్ బృందం ఒక కొండపై మావో యిస్టుల బృందం క్యాంప్లో ఉన్నట్లు గుర్తించిందన్నారు. మావోయిస్టులు డివిఎఫ్ బృందంపై కాల్పులు జ రపడంతో, స్వీయ రక్షణ కోసం పోలీసులు కాల్పుల జరిపారన్నారు. ఈ సం దర్భంలో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని తెలిపారు, కానీ హిడ్మా సమీపంలోని పొదల్లో దాక్కునే ప్రయత్నంలో పట్టుబడ్డాడన్నారు. హిడ్మా ఒడిశాతో సహా ఈ ప్రాంతంలో ఏడు ప్రధాన హింసాత్మక సంఘటనల్లో పాల్గొ న్నారని పోలీసులు వెల్లడించారు. అతను ఒడిశా, ఛత్తీస్గఢ్, ఎపి సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్ట్ కార్యకలాపాలకు కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఈ అరె స్టు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నిర్మూలనలో ఒక ప్రధాన విజయంగా భావిస్తు న్నారు. తొలుత మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా బలగాలకు చిక్కారు అని ప్రచారం జ రిగింది. ఆ తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించిన తర్వాత బలగాలకు చిక్కిన హిడ్మా, అగ్రనేత హిడ్మా వేరని స్పష్టమైంది.