ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర
కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి ఆయన పూర్తి పేరు తెంటు
లక్ష్మీనరసింహాచలం స్వస్థలం ఏలూరు జిల్లా ప్రగడవరం 40
ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర 2004లో ప్రభుత్వంతో
జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న సుధాకర్ ఎన్కౌంటర్ను
ధ్రువీకరించిన బీజాపూర్జిల్లా ఎస్పి డాక్టర్ జితేందర్యాదవ్
తప్పించుకున్న బండి ప్రకాశ్, పాపారావు సహా పలువురు అగ్రనేతలు
మావోయిస్టు పార్టీకి ఎదరుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యులు సుధాకర్ అలియాస్ సింహాచలం గౌతమ్ గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. మావోయిస్టు అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన నెల రోజులలోపే ఆ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తెంటు సింహాచలం మృతి చెందాడు. అతడు సుధాకర్గా పార్టీలో ప్రసిద్ధి చెందాడు. అతడికి గౌతమ్, ఆనంద్, చంటి , బాలకృష్ణ రామరాజు, సోమన్న అనే మారు పేర్లు ఉన్నాయి. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం.
గత 35 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్పై రూ.కోటి రూపాయల రివార్డు ఉంది. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ మావోయిస్టు సీనియర్ లీడర్లు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందడంతో బీజాపూర్ జిల్లాకు చెందిన డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, ఎన్డిఎఫ్, కోబ్రా దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున దళాలు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ నేలకొరిగినట్టు సమాచారం.
ఎన్కౌంటర్ను ధృవీకరించిన బీజాపూర్ జిల్లా ఎస్పి జితేందర్ యాదవ్
బీజాపూర్ ఎస్పి డాక్టర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్కౌంటర్ను ధృవీకరించారు. సుధాకర్ మృతికి సంబంధించి ఎటువంటి ప్రకటనను ఆయన జారీ చేయలేదు. బీజాపూర్ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరునెలల వ్యవధిలో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన ముగ్గురు నాయకులను దళాలు ఎన్కౌంటర్ చేయడం గమనార్హం.