Thursday, September 11, 2025

కూకట్‌పల్లిలో గృహిణి దారుణహత్య

- Advertisement -
- Advertisement -

గృహిణి దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… రేణు అగర్వాల్ (50) అనే మహిళ కుటుంబంతోపాటు కూట్‌పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. ఇంట్లోకి వచ్చిన నిందితులు రేణు కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. నిందితులు మహిళను కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో పనిచేసే జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు యువకులు కన్పించకపోవడంతో వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పిడుగుపాటుకు ఏడుగురు మృతి

ఇద్దరు యువకులు రేణును హత్య చేసి బైక్‌పై పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు హత్య చేసిన నిందితులను, హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. స్థానికంగా ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులు ఎటువైపు పారిపోయారనే దానిపై ఆరా తీస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News