Sunday, June 15, 2025

భారీగా పెరిగిన మారుతి జిమ్నీ అమ్మకాలు..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి భారతదేశంలో ఎంట్రీ లెవల్ కార్లను ప్రీమియం కార్లను విక్రయిస్తుంది. మారుతి సుజుకి జిమ్నీ 4X 4 డ్రైవ్‌తో వచ్చే ఒక ఎస్‌యూవీ. ఈ కారును థార్‌తో పోల్చిన రెండింటికి డిమాండ్ కూడా భిన్నంగా ఉంటుంది. జిమ్నీ ధర రూ. 12.76 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 2023 ఆటో ఎక్స్‌పో సందర్భంగా భారతదేశంలో 5-డోర్ జిమ్నీని తీసుకొచ్చారు.

గత నెల (మే 2025) జిమ్నీ బాగా అమ్ముడైంది. ఇది అన్ని రకాల రోడ్లపై బాగా నడిచే లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ. గత నెలలో మొత్తం 682 యూనిట్ల మారుతి జిమ్నీ అమ్మకాలు జరిగాయి. అయితే గత సంవత్సరం ఇదే సమయంలో ఈ సంఖ్య కేవలం 274 యూనిట్లు మాత్రమే. ఈసారి కంపెనీ 408 యూనిట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. అమ్మకాలు 149% పెరిగాయి.

మారుతి సుజుకి జిమ్నీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.76 లక్షల నుండి రూ. 14.97 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)ఉంటుంది. ఈ కారును 6 వేరియంట్లలో, 7 రంగు ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు.

మారుతి జిమ్నీ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, భద్రత కోసం EBDతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీనితో పాటు సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ స్టాండర్డ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు వంటి లక్షణాలు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి. ఇది హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీని కలిగి ఉంది. ఈ కారులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది.

మారుతి జిమ్నీ 1.5-లీటర్ K15B పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ కారు 103 bhp శక్తిని, 134 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ కారు 4×4 సిస్టమ్‌తో వస్తుంది. కాగా వాహనం ఒక లీటరులో 16.94 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News