- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం స్వామివారి దర్శనం కోసం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక, గురువారం 63,473 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,796 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం విలువ రూ.4.54 కోట్లుగా టిటిడి తెలిపింది.
- Advertisement -