Wednesday, September 17, 2025

రాజేంద్ర నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు దుకాణాలు దగ్ధం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సన్ సిటీ వద్ద క్రాకర్స్ దుకాణంలో ప్రమాదవశాత్తు శనివారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న దుర్గా భవాని హోటల్ కు వ్యాపించడంతో హోటల్ లో ఉన్న సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నాలుగు దుకాణాలకు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

సిలిండర్ పేలిన శబ్దాలకు చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News