Tuesday, June 3, 2025

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి, శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో వెంకన్న సర్వదర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనంకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఇక, ఆదివారం స్వామివారిని 78,031 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 32,936 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News