Monday, June 2, 2025

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉచిత దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది.

ఇక, శనివారం రికార్డు స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించారు. శ్రీవాణి దర్శన విధానం వచ్చిన తరువాత అత్యధిక మంది భక్తులకు టిటిడి దర్శనం కల్పించింది. నిన్న శ్రీవారిని 95,080 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 39,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.47 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News