Sunday, August 17, 2025

శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

- Advertisement -
- Advertisement -

గోదావరి ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర బాబ్లీ, విష్ణుపురి, మాలేగావ్ ప్రాజెక్టుల నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల మేరకు వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.501 టీఎంసీలు ఉండగా, శనివారం మధ్యాహ్నం వరకు 1082.30 అడుగులు, 62 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు ఎఈఈ రవి తెలిపారు. ప్రధాన కాల్వ కాకతీయ ద్వారా 4625 వేల క్యూసెకుకలు, మంచినీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 180 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 541 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు.

గత ఏడాది ఇదే రోజుప ప్రాజెక్టు నీటిమట్టం 1081.10 అడుగులు, 40.071 టీఎంసీలు ఉందని 1 జూన్ నుంచి ఇప్పటివరకు 46.930 టీఎంసీల నీరు వచ్చి చేరింది. 1 జూన్ నుంచి ఇప్పటివరకు 8.937 టీఎంసీల నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు. ఇంకా గోదావరి నదిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టే వారు, రైతులు, సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు కోరుతున్నారు. సింగూరు గేట్లు ఎత్తడంతో నిజాంసాగర్‌కు జలకళ వచ్చింది. ఉమ్మడి జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఈ సీజన్‌లో చుక్క నీరు రాక వెల వెల బోయింది. కాగా ఎగువ మెదక్ జిల్లాలో ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నిజాంసాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టం చేరువయ్యేలా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News