Saturday, May 24, 2025

మహిళల హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకమైనవి : సుప్రీం

- Advertisement -
- Advertisement -

మహిళలకు ప్రసూతి సెలవులను దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి సమర్ధించింది.న వారు మాతృత్వపు లబ్ధి, సంతానం పొందే హక్కుల్లో ఇవి అత్యంత కీలకమైనవని అభివర్ణించింది. ఏ సంస్థ స్త్రీలకు ఉన్న ప్రసూతి సెలవు హక్కును హరించలేదని న్యాయస్థానం వెల్లడించింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయినికి రెండో వివాహం అనంతరం బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రసూతి సెలవులను నిరాకరించారు. దీంతో ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన మొదటి వివాహం నుంచి ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో తాజాగా

మరోసారి ప్రసూతి సెలవులకు నిరాకరించినట్టు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్ర నిబంధనల ప్రకారం తొలి ఇద్దరు పిల్లలకు మహిళలు ప్రసూతి లబ్ధిని పొందే అవకాశం ఉంది. తాను రెండో వివాహం చేసుకొన్న అనంతరం ప్రభుత్వ ఉద్యోగంలో చేరినట్టు ఆ ఉపాధ్యాయిని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.న అంతేకాదు తన రెండు కాన్పులకు ఎటువంటి ప్రసూతి సెలవులు వాడుకోలేదన్నారు. ఈ సందర్భంగా ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది కేవీ ముత్తుకుమార్ స్పందిస్తూ ఆమె ప్రాథమిక హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News