Saturday, September 13, 2025

మెదక్ లో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై ముందున్న లారీని వెనక ఉన్న లారీ ఢీకొనడంతో నలుగురు ఘటనా స్థలంలో దుర్మరణంతో చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News