- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ లో కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవింగ్ చేస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం ఏకంగా ఇంటి ప్రహరి గోడపైకి వెళ్లింది. వెంటనే డ్రైవర్ గమనించి కారులో నుంచి దిగి పారిపోయాడు. స్థానికులు సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును గొడపైనుంచి కిందకు దించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -