- Advertisement -
కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. రింగ్ బస్తీలోని ఓ ఇంట్లో అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో రూమ్ అంత అగ్నికి ఆహుతిగా మారింది. మంటల ధాటికి పూర్తిగా సాయి (35) శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే అతడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -