Sunday, June 15, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బోడుప్పల్ : రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మేడిపల్లి పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం… ఇంజాపూర్ బి.యన్.రెడ్డి నగర్ కి చెందిన సైదులు (40)బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు దిగి నారాపల్లి బావర్చి ఎదురుగా రోడ్డు దాటుతుండగా ఒక లారీ డ్రైవర్ అతివేగంగా ఘట్కేసర్ నుండి ఉప్పల్ వైపుకు బండిని నడుపుకుంటూ వచ్చి రోడ్డు దాటుతున్నటువంటి సైదుల్ని బలంగా డికొన గా తలకి బలమైన గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇట్టి విషయంపై కేసు నమోదు చేసుకొని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని, యాక్సిడెంట్ కి కారణమైన లారీని సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంపై మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ బాటసారులకు రోడ్డు దాటుతున్న సమయంలో అప్రపత్తంగా ఉండాలని సూచించడం జరిగింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News