Friday, June 6, 2025

మల్లు రవికి మీనాక్షి వార్నింగ్?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపి మల్లు రవికి ఏఐసిసి వ్యవహారాల ఇన్ చార్జి మీ నాక్షి నటరాజన్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసిం ది. టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత రెండు రోజుల క్రితం తొలిసారి ఢిల్లీ నుంచి మల్లు రవి నేరుగా గాంధీ భవన్‌కు వచ్చారు. అక్కడ మాజీ చైర్మన్ జి.చిన్నారె డ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అక్కడే ఉన్న మీనాక్షిని మర్యాదపూర్వకంగా క లిశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చాక శంషాబా ద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన తన అనుచరుల తో కలిసి భారీ ర్యాలీ తీశారు. అలాగే గాంధీ భ వన్ వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టా రు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న మీనాక్షి నటరాజన్ మల్లురవి తీరు పట్ల తీవ్ర అ సహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్రమశిక్ష ణ కమిటీ చైర్మన్ పదవి వస్తే ఇంత హంగామా అవసరమా?

ఎందుకు ఇంత హడావిడి చేశారంటూ మల్లు రవికి మీనాక్షి నటరాజన్ చీవా ట్లు పెట్టినట్లుగా సమాచారం. అలాగే ఇటీవల పార్టీలో చేరిన అచ్చంపేటకు చెందిన ఓ కాం గ్రెస్ నాయకుడికి పదవి ఇవ్వడానికి ఎందుకు లాబీయింగ్ చేశారని భవిష్యత్‌లో ఆయన పార్టీ మారితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు అలంపూర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడుతో భేటీ కావడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు మీనాక్షికి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ఎమ్మెల్యే విజయుడు భేటీ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని ఆయన పిసిసికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతో మీనాక్షి మల్లు రవిని గట్టిగా హెచ్చరించినట్టుగా సమాచారం. స్థానిక కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపిన తరువాతే వేరే పార్టీ వారిని కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని ఆమె మల్లు రవికి సూచించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News