Sunday, June 15, 2025

బిఆర్ఎస్ మళ్లీ గెలవాలంటే రేవంత్ రెడ్డి సిఎంగా కొనసాగాలి: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక ఉద్యోగి అని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రేవంత్ రెడ్డి ముందు ఆయన ఉద్యోగాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు.. రేవంత్ రెడ్డి పార్టీ అధినేతల అపాయింట్ మెంట్ (Appointment party leaders) దొరక్కట్లేదని తెలియజేశారు. బిఆర్ఎస్ మళ్లీ గెలవాలంటే రేవంత్ రెడ్డి సిఎంగా కొనసాగాలని చెప్పారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి తరపున పోరాటం చేశామని, ఈ నెల 17న మెదక్ లో బిసి రిజర్వేషన్లపై సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ధర్నాలు, రైల్ రోకోలు, అవసరమైతే బంద్ కు పిలుపు ఇస్తామని, ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం లేదని సూచించారు. నరేంద్రమోడీని కలిసిన సిఎం రేవంత్ రెడ్డి బిసి బిల్లు గురించి కనీసం అడగలేదని, బిజెపికి కూడా బిసిలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వం దెబ్బతీసేలా పాఠ్యపుస్తకాలు మారుస్తున్నారని, కుమురంభీమ్ చిత్రపటం తొలగించి సైబర్ టవర్స్ ఫొటో ముద్రించారని కవిత మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News