Sunday, June 1, 2025

మెగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల

- Advertisement -
డిఎస్సి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మెగా డీఎస్సిని ప్రకటించింది. తాజాగా శనివారం మెగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రతిరోజు రెండు సెషన్లుగా డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారంగానే జరగనున్నాయి. దీంతో ఈ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాగా, 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జిటి, టీచర్ పోస్టుల భర్తీకి మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News