Thursday, June 26, 2025

కాజీపేట ఆర్‌ఎంయూలో మెమూ రైళ్ల కోచ్‌ల ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

రైల్వే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో కొత్తతరం మైన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (మెమూ) రైళ్లను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి చెప్పారు. దాదాపుగా 16 నుంచి 20 కోచ్‌లు ఉండే మెమూ రైళ్లను తెలంగాణలోని కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ) ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరిగింది.

ఈ చర్చల వివరాలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెమూ రైళ్లు, గ్రామీణ ప్రాంతాలు, సెమీ-అర్బన్ ప్రాంతాలను అనుసంధానించడంలో మరీ ముఖ్యంగా పండగల సమయంలో ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. రూ.716 కోట్లతో కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. 2026 జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు వివరించారు. 2026 మే నుంచి ఈ కేంద్రం ద్వారా రైలు కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఆ ప్రకటనలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News