ఎలాన్ మస్క్కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధించింది.2019లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్పట్లో టెస్లాపై కేసు నమోదైంది. టెస్ల్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థలో లోపం వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు తాజాగా ఫ్లోరిడా కోర్టు తేల్చింది. బాధిత కుటుంబానికి 240 మిలియన్ డాలర్ల( భారత కరెన్సీలో సుమారుగా రూ.1996 కోట్లు)పరిహారం చెల్లించాలని టెస్లాను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే ఫ్లోరిడాలోని కీ లార్గో ప్రాంతంలో 2019లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. జార్జ్ మెక్ గీ అనే వ్యక్తి తన టెస్లా కారులో వెళుతూ అత్యాధునిక ఆటోపైలట్ ఫీచర్ను ఉపయోగించాడు. ఇది టెస్లా అందించిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ వ్యవస్థ. మార్గమధ్యంలో జార్జ్ మొబైల్ కారులో కిందపడిపోయింది. కారు ఆటోపైలట్ మోడ్లోనే ఉండడంతో అతను కిందికి వంగి మొబైల్ తీసుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే కారు అదుపు తప్పి పక్కనే పార్క్ చేసి ఉన్న మరో కారును ఢీకొంది.ఆపై ఇద్దరు వ్యక్తులపైకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో 22 ఏళ్ల యువతి అక్కడిక్కడే మృతి చెందగా,ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు ప్రకటించింది. ఈ ప్రమాదానికి నష్టపరిహారంగా బాధిత కుటుంబాలకు 329 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు కారు యజమానిని ఆదేశించింది. అయితే ప్రమాదానికి ఆటో పైలట్ వ్యవస్థలో లోపం కూడా ఓ కారణమని గుర్తించిన న్యాయస్థానం ఆ మొత్తం పరిహారంలో 242 మిలియన్ డాలర్లు టెస్లా కంపెనీ చెల్లించాలని ఆదేశించింది. మిగతా మొత్తం కారు యజమాని చెల్లించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఫ్లోరిడా కోర్టు తీర్పుపై పై కోర్టులో అపీల్ చేయనున్నట్లు టెస్ల్లా తెలిపింది.