Friday, June 6, 2025

మంత్రివర్గ సమావేశానికి ముందు కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి కొండా

- Advertisement -
- Advertisement -

సచివాలయంలోని కేబినెట్ హాల్ వద్ద గురువారం మధ్యాహ్నాం కీలక ఘటన చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ కళ్లు తిరిగి పడిపోవడంతో అక్కడ ఉన్నవారంతా కాసేపు ఆందోళనకు లోనయ్యారు. అప్పటికే మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతున్న సమయంలో ఈ ఘటన జరగడం విశేషం. వెంటనే అక్కడే హుటాహుటీన అక్కడకు చేరిన వైద్య బృందం ఆమెకు ప్రాథమిక వైద్యం అందించారు. మెడికల్ పరీక్షల అనంతరం వైద్యులు మంత్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ప్రకటించారు. లో బిపి కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు డాక్టర్లు తెలిపారు. తక్షణమే ఇంజెక్షన్ ఇచ్చి, కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించారు. కేబినెట్ సమావేశానికి హాజరై ఉన్న సమయంలో ఈ తాత్కాలిక అస్వస్థత కలిగినప్పటికీ, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రి సురేఖకు తిరిగి పూర్తిస్థాయి విశ్రాంతి కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News