Tuesday, September 16, 2025

మళ్లీ ఢిల్లీ మోచేతి నీళ్లు తాగే పరిస్థితి రాకూడదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని కెటిఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. గౌరవ ప్రదమైన మెజార్టీతో గెలిపిస్తారని నమ్ముతున్నానని తెలిపారు. 55 ఏళ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారో మళ్లీ ఢిల్లీ మోచేతి నీళ్లు తాగే పరిస్థితి వస్తుందని కెటిఆర్ హెచ్చరించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావు గురువారం ఉదయం నామినేషన్లు వేశారు. గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో కెసిఆర్ ఉదయం 11.06 గంటలకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్డీఓ బన్సీలాల్ కు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News