ప్రజలకు మరింత మెరుగైన పారదర్శక సేవలు అందించడానికి వీలుగా, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను అనుసందానం చేసేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రిజిస్ట్రేషన్లకు సర్వేమ్యాప్ను జతచేయాలని భూభారతి చట్టంలో పేర్కొనట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని భూబారతి పోర్టల్ సర్వే మ్యాప్ లింక్ చేసేలా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం లోని తన కార్యాలయం లో సోమవారం రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగం, ఎన్ఐసి అధికారులతో సమావేశు నిర్వహించారు
. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ బారతి పోర్టల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా పోర్టల్ నిర్వహణ మరిం త సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఐసి అధికారులకు సూచించారు. కొత్తగాలు భివృద్ధి చేసేసాఫ్ట్వేర్లో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టమ్ ఉండేలా చూడాలన్నారు. నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే కాలికి వచ్చిందని, ఈ నేపథ్యం లోనే మిగిలిన 408 గ్రామాల్లో మరి కొద్ది రోజుల్లోనే రీసర్వేను ప్రారం భిం చబోతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భవిష్యత్తో రాష్ట్రం లో భూవివాదాల పరి ష్కారానికి ఈ సర్వే మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐ.జీ. రాజీవ్ గాంధీ హనుమంతు, సిసిఎల్ఎ కార్యదర్శి మండా మకరంద్ . ఎన్వెసి ఎస్బోఓ ప్రసాద్, విజయ్్మహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.