వరద నిర్వహణకు హైదరాబాద్
తరహాలోనే జిల్లాల్లో ఏర్పాట్లు
ప్రకృతి విపత్తుల విభాగం
బలోపేతానికి ఉన్నత స్థాయి కమిటీ
వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలి
నష్టం జరగకముందే అధికారులు
స్పందించాలి రెవెన్యూ, హౌసింగ్
శాఖల మంత్రి పొంగులేటి
శ్రీనివాసరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో సా ధారణ కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో గోదావరి కృష్ణా నదీ పరివాహాక ప్రాంతాల్లో వీలైనంత వరకు ప్రాణ, ఆస్థి, ఆర్ధిక నష్టం జరగకుండా ఇప్పటి నుండే పకడ్బందీ చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతా ల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగిన తర్వాత స్పందించే దానికంటే నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్య లు, విపత్తుల నిర్వహణా విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్, అగ్నిమాపక డిజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంట ర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్ అండ్ బి, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.
అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలి
ఈ ఏడాది వర్షాకాల సీజన్ దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వీలైనంత వరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రదేశాల్లో జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో హఠాత్తుగా వచ్చే వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా పరీవాహక ప్రాంతాల్లోని నివాసి తులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించి వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.వెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మూసపద్ధతికి స్వస్తి చెప్పి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలన్నారు.
అవసరమైన యూజర్ ఐడీలను ఇవ్వాలి
హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు, నిర్వహణ, ముందస్తు హెచ్చరికల కోసం అవసరమైన యూజర్ ఐడీలను ఇవ్వాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి వరదల కార్యాచరణ ప్రణాళికలను ఈనెల 30వ తేదీలోగా తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాం తాల్లో ఆపద మిత్ర వలంటీర్స్, ఎన్డిఆర్ఎఫ్ (అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ, ప్రత్యేక పోలీస్ విభాగంలోని ఎస్డిఆర్ఎఫ్) సాయంతో సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి పొంగులేటి సూచించారు. వరద నియంత్రణ కట్టలు, చిన్న-మధ్య తరహా కాల్వలు, వర్షపు నీటి డ్రెయిన్లు మొదలైన వాటిని పరిశీలించి మరమ్మత్తులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించాలి
బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర, పొడి ఆహార కిట్లు ముం దే సిద్ధంగా ఉంచాలని మంత్రి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖల సామాన్యంతో పనిచేయాలని కంట్రోల్ రూంలు ప్రారంభించాలని అధిక ప్రమాద ప్రాంతాల్లో స్థానిక రె స్యూ బృందాలను ఏర్పాటు చేసి, వారికి ఖాళీ చేయుట, తక్షణ స్పందన చర్యలపై శిక్షణ ఇవ్వాలని మంత్రి సూ చించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హరీష్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పంచాయితీరాజ్ కమిషనర్ సృజన, సిపి డిసిఎల్ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ, వ్యవసాయ సహకార శాఖ డైరెక్టర్ బి. గోపి. ఐఎండి అధికారిణి నాగరత్నం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్, ములుగు, నిర్మల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.