Sunday, June 1, 2025

లబ్ధిదారుల ఎంపికలో.. విపక్షాలకూ వాటా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు 40శాతం పేర్లను ఎంపిక చేసే అవకాశం ఇచ్చామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అందులో కెటిఆర్ మాత్రం లబ్ధిదారుల ఎంపికపై స్పందించ లేదని, అధికారులే ఎంపిక చేసుకోవాలని సూచించినట్టు కలెక్టర్ తనతో తెలిపారని మంత్రి పొంగులేటి తెలిపారు. మిగిలిన 60 శాతం ఎంపిక బా ధ్యతలను ఇందిరమ్మ కమిటీలకు అప్పజెప్పినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.10 లక్షల లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూన్ 10వ తేదీ లో గా అర్హులైన మిగతా లబ్ధిదారుల జాబితా కూడా రెడీ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. మొద టి విడతలో 4లక్షల 50వేల ఇళ్లు ఇస్తామని మం త్రి తెలిపారు.

పైలట్ ప్రాజెక్టులో భాగంగా 42 వేల ఇళ్లను మంజూరు చేయగా 24వేల ఇళ్లు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. ఈ నిర్మాణాలకు సంబంధించి రూ.130 కోట్లు చె ల్లించామని ఆయన తెలిపారు. శుక్రవారం మం త్రి పొంగులేటి సచివాలయంలో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా సమాన స్థాయిలో ఇళ్ల కేటాయింపులు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటించి ఈ నిర్మాణాలను పరిశీలిస్తానని ఆయన తెలిపారు. సుమారు 100ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని, మిగతా ఇళ్లను కూడా అతి త్వరలోనే సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. ఐటిడిఏ పరిధిలోని చెంచులకు 9,200 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఐటిడిఎ ప్రాంతంలో ఉండే నియోజక వర్గాలకు అదనంగా ఈ ఇళ్లను ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.

ధరల నియంత్రణ కమిటీ ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ధరల నియంత్రణ కమిటీని ఒకటి, రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ధరల నియంత్రణ కమిటీకి సంబంధించి జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఈ కమిటీ పని చేస్తుందన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలోనూ మరో కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. స్టీల్, సిమెంట్ రేట్లు ఏడాది క్రితం నుంచి ఎలా ఉన్నాయో అంచనా వేసి వాటి ప్రకారం నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇప్పటికే సిమెంట్, స్టీల్ కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా కేంద్రాల్లోనూ స్లమ్‌లో నివసించే పేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ స్థలంలో ఉండి స్లమ్‌లో నివసించే వారికి ఇళ్లు కట్టించి పట్టాలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై సిఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు ఇచ్చారని, కలెక్టర్‌లు స్లమ్‌లను గుర్తించే పనిలో ఉన్నారని మంత్రి తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 16 స్లమ్‌లను గుర్తించామని 9 నుంచి 10 స్లమ్‌ల్లో జి ప్లస్ 4 కింద నిర్మాణాలు చేపట్టి ఇళ్లను కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు.

కవిత ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్
కవిత ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీలో ఒకరు ఆడమంటారు, మరొకరు ఆడతారని ఆయన ఎద్దేవా చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్కటి కాదు చాలా తప్పులు చేశారని అన్నింటికి శిక్ష తప్పదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. కెసిఆర్ దగ్గర దెయ్యాలు ఉన్నాయని కవిత అంటున్నారని ఆ దెయ్యాలు ఎవరో కవితనే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేవుడు, దెయ్యాలు అంటున్న కవిత నోరు ఎందుకు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. కవిత నోరు విప్పాలని ఆమె ఏం చెబుతుందో వినాలని తాము కూడా చూస్తున్నామని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌కు బిజెపితో సంబంధం ఉందని కవిత స్వయంగా చెప్పారని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు. బిజెపి ఎమ్మెల్యే కూడా ఈ విషయాన్ని అంగీకరించారని ఆయన చెప్పారు. కవిత పార్టీలోకి వచ్చినా ఆమెకు మంత్రి పదవి ఇచ్చినా మాట్లాడే అర్హత తనకు లేదన్నారు.

కెటిఆర్‌కు ఈడీ అంటే ఉత్సాహం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కెటిఆర్‌కు ఈడీ అంటే ఉత్సాహం ఎక్కువగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈడీ అధికారులు తన ఇంటికి ఎప్పుడూ రాలేదని, తన కూతురు ఇంటికి వచ్చారని, ఈడీ అధికారులు తన ఇంటికి ఎందుకు రావడం లేదో కెటిఆర్ ఈడీ అధికారులను అడిగితే బాగుంటుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో బిజెపి, బిఆర్‌ఎస్‌కు దోస్తానా ఉందని ఆయన ఆరోపించారు. కవితనే ఆ విషయం స్వయంగా చెబుతున్నారని ఆయన అన్నారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీని సిఎం రేవంత్‌రెడ్డిని కలవడం లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయని, కానీ, అర్ధరాత్రయినా రాహుల్‌గాంధీని కలిసే చనువు రేవంత్‌రెడ్డికి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డిల మంచి సంబంధం ఉందని, రేవంత్ ఎప్పుడు అనుకుంటే అప్పుడే రాహుల్‌ను కలుస్తారని ఆయన తెలిపారు. మా బాస్ రాహుల్ గాంధీ అని ఆయన పేర్కొన్నారు. తానెప్పుడు నెంబర్ 2 అని చెప్పలేదని, కాంగ్రెస్ పార్టీలో తాను నీటి బిందువును మాత్రమేనని ఆయన తెలిపారు.

భూ భకాసురుల సంగతి త్వరలో తెలుస్తాం
కెసిఆర్ ప్రభుత్వంలోని భూ భకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఎవరిని పిలవాలో తమ ప్రభుత్వం చెప్పదని ఆయన తేల్చిచెప్పారు. ప్రభుత్వం చెప్పేది ఉంటే కెసిఆర్‌ను ముందు పిలవాలని చెప్పేవాళ్లమని ఆయన తెలిపారు. కాళేశ్వరంలో ఎల్ అండ్ టి కంపెనీ కూడా ముద్దాయిగా ఉందని ఆయన చెప్పారు. తప్పు చేసి దొరికి కూడా తండ్రి, కొడుకులు దబాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత తప్పుచేసిన వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీలో తాను నీటి బిందువును మాత్రమే
కాంగ్రెస్ లీడర్లు కట్టిన జూరాల, ఇతర ప్రాజెక్టులు కూలితే మమ్మలను అప్పుడు జైల్లో పెట్టేవారని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కనీస నిబంధల ప్రకారం కట్టలేదని, ఇసుకపై బ్యారేజీ కడితే కాళేశ్వరం కడితే ఎలా ఆగుతుందని, తాము నిపుణులం కాదనీ, కెసిఆర్ నిపుణుడు కదా ఆయనే నివేదిక కూడా రాయాలన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూలింది కాబట్టే సరిపోయిందని, లేదంటే తామే కూల్చామని వారు బద్‌నాం చేసేవారన్నారు.

సాదాబైనామాపై కోర్టులో స్టే ఉంది
భూ భారతి ద్వారా వంద శాతం భూమి సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాదాబైనామాపై 9లక్షల 26 వేల దరఖాస్తులు వచ్చాయని, సాదాబైనామా దరఖాస్తులపై కోర్టులో స్టే ఉందని, త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. పాలేరులో ప్రభుత్వ భూములను సాదాబైనామాగా క్రియేట్ చేశారని, గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ ఆస్తులను కొందరు సొంతం చేసుకునే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. వచ్చిన దరఖాస్తులో 39 శాతం సాదాబైనామాలే ఉన్నాయన్నారు. నాలుగు మండలాల్లో అసైన్డ్ భూములను పేదలకు పట్టాలు ఇవ్వబోతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లోని 28 మండలాల్లో ఫైలెట్ ప్రాజెక్టుగా దరఖాస్తుల పరిశీలన చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. సర్వే నెంబర్ల విషయంలో సమస్యలు ఉంటే తహసీల్దార్ ఆధ్వర్యంలో పరిష్కారం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అన్ని రెవెన్యూ గ్రామాల్లో 18 రోజుల పాటు భూ సమస్యలను పరిష్కరించబోతున్నాం
జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 18 రోజుల పాటు అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్ బృందం వెళుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లే ముందు నోటీసులు ఇచ్చి గ్రౌండ్‌లోనే సమస్యను పరిష్కారం చేయబోతున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. స్పాట్‌లోనే భూ సమస్యలను పరిష్కరించబోతున్నామని మంత్రి తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్‌లను సర్వే చేయడానికి ఉపయోగిస్తామని ఆయన తెలిపారు.

ఏసిబికి ఎక్కువగా దొరుకుతున్నారు…
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు ఏసిబికి ఎక్కువగా దొరుకుతున్నారని మంత్రి పొంగులేటి వాపోయారు. అనేక సందర్భాల్లో తాను ఈ విషయంలో షేమ్‌గా ఫీల్ అయ్యేవాడినని ఆయన తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని ఈ శాఖలో అమల్లోకి తీసుకొచ్చామని, ఏఐతో అనుసంధానం చేశామని, రానున్న రోజుల్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆధార్‌తో లింక్ చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు.
413 రెవెన్యూ గ్రామాలకు నక్షాలు లేవు
413 రెవెన్యూ గ్రామాలకు నక్షాలు లేవని, ఆయా గ్రామాలకు బౌండరీలు లేవని మంత్రి పొంగులేటి తెలిపారు. దీనికి సంబంధించి పని ప్రారంభించామని ఇప్పటికే 5గ్రామాలను నక్షాల్లోకి ఎక్కించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఫోరెన్సిక్ ఆడిట్‌పై వారంలోనే తుది నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. జూన్ 3వ తేదీ నుంచి 28వరకు భూ భారతి దరఖాస్తులు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News