Thursday, August 28, 2025

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ (సీతక్క) పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్ట్కర్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. వరుసగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా ముంపుకు గురైన కామారెడ్డి పట్టణంలోని జి.ఆర్ కాలనీని మంత్రి స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో రవాణా అంతరాయాలు, విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సదుపాయాలు కల్పించి పునరావాస కేంద్రాల్లో ఆహారం, మంచినీరు, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలని, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు భరోసా కల్పించాలని,

ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండి ప్రతి కుటుంబానికి అవసరమైన సాయం అందించాలన్నారు. సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతాయన్నారు. ప్రభుత్వము, అధికారుల అప్రమత్తత వల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామని, వరద ముంపులో చిక్కుకున్న చాలామందిని రక్షించామనిసీఎం గారు వర్షాలు వరదల మీద వరుస సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులను, అధికార యంత్రాంగాన్ని గైడ్ చేస్తున్నారన్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ జరగటం వల్ల వరద ఉధృతి పెరిగిందని, వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనావేస్తున్నామని బాధితులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వం వరద బాధితులకు స్థానిక అధికారుల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయాలు చేయకుండా ఎవరికి తోచినట్టుగా వారు బాధితులకు అండగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు దయచేసి పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని కోరారు. ఎలాంటి విపత్కాల పరిస్థితులు తలెత్తిన ఎదుర్కునేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా సిద్ధంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News