మన తెలంగాణ/హైదరాబాద్: కడియం శ్రీహరి నల్లికుట్ల మ నిషి అని, తాను మంత్రిగా ఉంటే తట్టుకోలేపోతున్నారని అట వీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన ముందు కూర్చోవడానికి కడియం శ్రీహరి నామోషీగా ఫీల్ అ వుతున్నారని ఆమె పేర్కొన్నారు. అందుకే నా మంత్రి పదవి పో తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్య క్తం చేశారు. తరుచూ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. టిడిపిలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా నడిపించాలని కడియం శ్రీహరి అనుకుంటున్నారని, కానీ, కాంగ్రెస్లో అలా నడవదని ఆమె పేర్కొన్నారు.
తనకు అదృష్టం ఉంది కాబట్టి మంత్రి అయ్యానని,
ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యారని, తరుచూ నేను మంత్రిగా దిగిపోవాలని మాట్లాడటం కడియం శ్రీహరికి సరికాదని మంత్రి కొండా పేర్కొన్నారు. తన కూతురికి అదృష్టం లేనందున ఎమ్మెల్యే కాలేకపోయిందని, కడియం కూతురికి అదృష్టం ఉన్నందునే ఆమె ఎంపి అయ్యిందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఉమ్మడి వరంగల్లోని కాంగ్రెస్ కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి సురేఖ కౌంటర్ ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదనీ, కొందరు తమ సొత్తు అన్నట్లు ఫీల్ అవుతున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సరికాదని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హితవు పలికారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఆగమశాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని, అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రకాళి అమ్మవారు శాకాహారి అని అందరికీ తెలుసనీ, అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నామని, బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని కొండా సురేఖ స్పష్టం చేశారు.
గోదావరి పుష్కరాల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలి
గోదావరి పుష్కరాల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని మంత్రి కొండా సురేఖ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పుష్కరాలకు రూ.200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. గోదావరి పుష్కరాలు ఎపి కంటే తెలంగాణలోనే ఎక్కువ జరుగుతాయని, భద్రాచల రాముడి పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని ఆమె చెప్పారు. కేంద్రం తెలంగాణ మీద వివక్ష చూపొద్దని, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు చొరవ తీసుకోవాలని తెలంగాణకు పుష్కరాల నిధులు ఇప్పించాలని మంత్రి కొండా డిమాండ్ చేశారు. లేదంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఇద్దరూ చేతకాని మంత్రులుగా మిగిలిపోతారని ఆమె విమర్శించారు.