Sunday, July 6, 2025

ప్రభుత్వ పథకాల్లో జర్నలిస్టులను భాగస్వామ్యం చేస్తాం:మంత్రి శ్రీధర్‌బాబు

- Advertisement -
- Advertisement -

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్ట్‌లను ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములను చేస్తామని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా, మంథని ప్రెస్‌క్లబ్ కార్యాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వపరంగా తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందువల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులందరికీ భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పాత్రికేయులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పత్రికలు ప్రజలకు వారధిగా పనిచేయాలని హితవు పలికారు. ప్రజల సంక్షేమం ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై పాత్రికేయులు తమ ఆలోచన విధానాన్ని వార్తల రూపంలో అందజేయాలని కోరారు.

మంథని ప్రాంత జర్నలిస్టుల సమస్యల కోసం తాను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వారి అభివృద్ధి కోసం అనేక విధాలుగా సహకరించానని అన్నారు. మంథనిలో ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి సిఎస్‌ఆర్ నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. పాత్రికేయులకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాస్ పథకాల మంజూరు కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబును ప్రెస్‌క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవల టియుడబ్లూజె జిల్లా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షుడు కొమురోజు చంద్రమోహన్, కోశాధికారి తగరం రాజు, కార్యవర్గ సభ్యులు లక్కాకుల నాగరాజును శాలువాలతో మంత్రి శ్రీధర్‌బాబు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్, ఉపాధ్యక్షుడు బర్ల సంపత్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, సహాయ కార్యదర్శి గంధం అంజిబాబు, ప్రెస్‌క్లబ్ సభ్యులు అంకరి ప్రకాష్, కంది కృష్ణారెడ్డి, ఆర్ల బాబు, పెండ్యాల రామ్‌కుమార్, బాసాని సాగర్, ఒజ్జల శ్రీనివాస్, లింగాల సురేష్, దొరగొర్ల రవీందర్, కేసారపు రవి, బండారి సమ్మయ్య పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News