Monday, June 2, 2025

ఉద్యోగుల సమస్యలపై మంత్రుల సబ్ కమిటీకి నివేదిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఉ ద్యోగుల సమస్యల పరిష్కార కోసం రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్‌కో సిఎండి కృష్ణ భాస్కర్ తదితర ఉన్నతాధికారులతో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన త్రీమెన్ కమిటీ వారి సమస్యలకు సంబంధించిన విజ్ఞాపన ప త్రాలు స్వీకరించింది. తదుపరి త్రీమెన్ కమిటీ డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఏర్పడిన సబ్ కమిటీకి శనివారం సాయంత్రం ప్రజాభవన్‌లో నివేదిక సమర్పించింది. సబ్ కమిటీలో సభ్యులైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభు త్వ సలహాదారు కే. కేశవరావు సమావేశానికి హా జరయ్యారు. అధికారుల నుంచి నివేదిక స్వీకరించిన సబ్ కమిటీ ఆ నివేదికను పూర్తిగా అధ్యయన చేసి అతి త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News