న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ మహమ్మారి రోజురోజుకూ వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 7వేలు దాటింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ అ ధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని పీఎంఓ సూచించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ బు ధవారం విడుదల చేసిన అధికారిక తాజా డేటా ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదవడంతో ప్ర స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7121 కి చేరింది. దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 74కు పెరిగింది. కేరళలో అత్యధికంగా 2223 యాక్టివ్ కేసులుండగా, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ తర్వాతి స్థా నాల్లో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
కరో నా కొత్త వేరియంట్పై భయాందోళనలు అవసరం లేదని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల ని అధికారులు సూచించారు. డేటా బోర్డు లో వెల్లడించిన సమాచారం ప్రకారం… దేశంలో మొత్తం 7121 కేసులు ఉండగా, కేరళలో అత్యధికంగా 2223 కే సులు నమోదయ్యాయి.గుజరాత్ 1223, ఢిల్లీ 757, పశ్చిమబెంగాల్ 747, మహారాష్ట్ర 615, కర్ణాటక 459, ఉత్తరప్రదేశ్ 229, తమిళనాడు 204,రాజస్థాన్138,హ ర్యా నా125,ఎపి72, మధ్యప్రదేశ్ 65, మహారాష్ట్ర 615, ఛత్తీస్గఢ్ 48, బీహార్ 47, ఒడిశా41,సిక్కిం,పంజాబ్లలో33కేసులు, తెలంగాణ11 పుదుచ్చేరి,ఝార్ఖండ్ ల్లో చెరో 10కేసులు, జమ్ముకశ్మీర్ 9, అ స్సాం, గోవాల్లో 6, చండీగఢ్ , ఉత్తరాఖండ్ 3, హిమాచల్ప్రదేశ్ 2,మణిపుర, త్రిపుర చెరో కేసు నమోదయ్యాయి.