హైదరాబాద్: బిఆర్ఎస్ ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్(62) ఆరోగ్యం పరిస్థితి అత్యంత విషమగా ఉంది. ప్రస్తుతం మాగంటి గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో ఐసియు చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం 4.35 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో ఎఐజి ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్టు గురైనట్టు వైద్యులు గురించి వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, 48 గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. గతంలో కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఎఐజిలో చేరిన విషయం తెలిసిందే. మాగంటి గోపీనాథ్కు గుండె పోటు వచ్చిన సమాచారం తెలియగానే బిఆర్ఎస్ నేతలు హరీష్ రావు, నామా నాగేశ్వర్ రావు, కెపి వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు, దాసోజు శ్రవణ్, బిఆర్ఎస్ నేతలు ఆస్పత్రికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్ కూడా మాగంటి ఆరోగ్యంపై ఆరా తీశారు. మాగంటి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమం
- Advertisement -
- Advertisement -
- Advertisement -