- Advertisement -
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండో సమస్యతో బాధపడుతుండటంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు, పలువురు బిఆర్ఎస్ నేతలు వెంటనే ఏఐజి ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఐసియూలో ఉన్నారని.. చికిత్స కొనసాగుతోందన్న చెప్పారు.
- Advertisement -