Monday, June 30, 2025

హైకమాండే ఫైనల్

- Advertisement -
- Advertisement -

క్రమశిక్షణ సంఘానికి
తప్పుడు సమాచారం ఇచ్చి
తప్పించుకోవాలని చూస్తున్నారు
కొండా దంపతులు మారని
పార్టీ లేదు నోటీసులు ఇచ్చిన
విషయం చెప్పకుండా
బడాయి ప్రదర్శిస్తున్నారు
మాజీ ఎంపి రామసహాయం
పేరెత్తితే సహించం రెచ్చగొట్టే
వ్యాఖ్యలు చేసినా సంయమనం
పాటిస్తున్నాం వరంగల్‌లో
కొండా వ్యతిరేక కూటమి
ఎంఎల్‌ఎలు, నేతల భేటీ

మన తెలంగాణ/హన్మకొండ: మాజీ ఎంఎల్‌సి కొండా మురళి అంటే ఎవరికీ భయం లేదని, ఆయన చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై అధిష్ఠా నం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య అన్నారు. ము రళికి ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చే ముం దు తన డాబు తగ్గకుండా
ఉండేందుకు అధిష్ఠా నం నిర్ణయాలను ధిక్కరించే విధంగా ఉన్నాయ ని వారు వ్యాఖ్యానించారు. హన్మకొండలోని ఎంఎల్‌ఎ నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెం దిన ఎంఎల్‌ఎలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్ వెంకటరెడ్డి, డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సమావేశమయ్యారు.

అనంతరం వారు మీడి యాతో మాట్లాడారు. ఎంఎల్‌ఎ నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడు తూ.. కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి తప్పుడు వివరాలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. పార్టీని దెబ్బతీసేలా మాట్లాడి.. ఇప్పుడు అసలు విష యం తప్పుదోవపట్ట్టేలా చేశారని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంఎల్‌ఎలకు వ్యతిరేకంగా మాట్లాడడమే కాకుండా.. తప్పుడు వివరాలను ఇచ్చి.. మీడియా ఎదుట మళ్లీ ఎంఎల్‌ఎలపై దురుసుగా మాట్లాడారని అన్నారు. ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. కొం డా మురళి మారని పార్టీ లేదు.. అవకాశాన్ని బట్టి పార్టీలు మారడం.. వ్యక్తులను, లీడర్లను దూషించడం పరిపాటేనని అన్నారు. ఆయన 38 ఏళ్లుగా అందరికీ అండగా ఉంటూ.. పార్టీని కాపాడుతున్నానని చెబుతున్నారని, కొండా దంపతులు ఇప్పటి వరకు టిడిపి, కాంగ్రెస్, వైఎస్సార్ సిపి, బిఆర్‌ఎస్‌లో వరుసగా మారుతూ వస్తున్నారని అన్నారు. గత ఎన్నికల ముందే వారు బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరార, వారు ఏనాడూ కాంగ్రెస్‌లో కుదురుగా లేరన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరి కంటే ఎక్కువసార్లు పార్టీ మారింది వారేనని అన్నారు.

ఇక పార్టీలు మారడమే కాకుండా, పార్టీ శ్రేణులను, పార్టీ పరిస్థితులను భ్రష్టుపట్టించడం వారి నైజం అన్నారు. క్రమశిక్షణ కమిటీ పిలవకుండానే తనంతట తానే గాంధీభవన్‌కు వచ్చి ఆయనతంటా ఆయనే వివరాలు సమర్పించానని మీడియా ముందు చెప్పారని, నోటీసులు ఇచ్చిన విషయం చెప్పకుండా దాటవేసి తన డాబును ప్రదర్శించారని అన్నారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి పిలుపు మేరకు వచ్చినా.. ఆయన తన గొప్పను చాటుకోవడానికి, మీడియాలో హైలెట్ కావడానికి క్రమశిక్షణ కమిటీ పిలువలేదని చెప్పారని , మల్లు రవి మాత్రం జూలై 5వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించగా.. కొండా మురళి వచ్చారని చెప్పారని అన్నారు.. ఆయన తీరు ఎప్పుడూ ప్రజలను, పార్టీ నేతలను తప్పుదోవ పట్టించే విధంగానే ఉంటుందన్నారు. కొండా మురళి చేసిన ప్రకటన ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఈ విషయాలను క్రమశిక్షణ కమిటీ గుర్తించాల్సి ఉంటుందన్నారు. అనేకసార్లు ఎన్నికల్లో ఓడిపోయి.. ప్రజలకు, శ్రేణులకు దూరం అయ్యారన్నారు.

ఇక మంత్రిగా ఉండి గత పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీకి మెజార్టీ సాధించలేదని తామెన్నడూ ఓడిపోలేదని ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. 2012లో పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సిపి అభ్యర్థిగా, 2018 కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2008లో కొండా సురేఖ ఎంపి అభ్యర్థిగా ఓడిపోయారని, 2001లో కాంగ్రెస్ నుంచి సంగెం జడ్‌పిటిసి స్థానం నుంచి బరిలో నిలిచి కొండా మురళి ఘోర పరాజయం చవిచూశారని అన్నారు. 2018లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా ఉన్న కొండా దంపతుల ప్రవర్తన నచ్చక కెసిఆర్ మళ్లీ టికెట్ కేటాయించేందుకు నిరాకరించారని వ్యాఖ్యానించారు. ఇది కొండా దంపతుల కుటిల, రౌడీ రాజకీయాల్లోని గణచరిత్ర అని ఎద్దేవా చేవారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేకసార్లు పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఎన్నికై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న రామ సహాయం సురేందర్ రెడ్డిపై పూర్తిగా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని తీవ్రంగా హెచ్చరిస్తున్నామని అన్నారు.

1996 లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేందర్ రెడ్డి పోటీ చేసి, తెలుగుదేశం ్ట అభ్యర్థి అజ్మీరా చందులాల్ చేతిలో ఓడిపోయారన్నారు.1996 ఎన్నికల తర్వాత సురేందర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారని అన్నారు. ఆ తర్వాత ఆయన ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత వరంగల్ పార్లమెంట్ ఎస్‌సిలకు, మహబూబాబాద్ ఎస్‌టిలకు రిజర్వ్ అయిందన్నారు. సురేందర్ రెడ్డి నియోజకవర్గాల పునర్ విభజనలో సీటు లేకుండా చేశారని, అందుకే ఆయన తమపై కక్షగట్టి ప్రస్తుత వరంగల్ ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పునర్ విభజనకు ముందే (12 ఏళ్ల) ఆయన రాజకీయాల నుంచి విరమణ తీసుకున్నారన్నారు. కాంగ్రెస్‌కు నిస్వార్థంగా సేవలందించిన సురేందర్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కొండా మురళి చౌకబారు రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News