- Advertisement -
ఎర్రవల్లి: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హుటా హుటిన అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరవుతున్న నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చారు. అక్కడ అస్వస్థత గురవడంతో వెంటనే హైదరాబాద్ కు తరలించారు. పల్లా కాలు జారిపడడంతో గాయాలైనట్టు సమాచారం.
- Advertisement -