Friday, June 13, 2025

రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కార్: ఎంఎల్ఎ పాయల్ శంకర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటామని హామీలు ఇచ్చి రైతాంగాన్ని నట్టేట ముంచిందని బిజెపి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేండ్లు బిఆర్‌ఎస్ పాలనలో రైతులు ఒకరకమైన బాధలో ఉండగా, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారిందన్నారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమంపై ఘనంగా హామీలు ఇచ్చారని,

రైతులకు కష్టాలు లేకుండా చూస్తా, రెండు లక్షల వరకు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తా అనే మాటలకు ఆశపడ్డ రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని ఆయన తెలిపారు. కానీ ఈరోజు సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని ప్రభుత్వమే చెబుతోందని, మిగిలిన సగం మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తునే ఉన్నారని తెలిపారు. రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడుతున్నారు కానీ, రైతులు విత్తనాలు వేసే పరిస్థితికి చేతిలో పైసా లేదు, ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు అని పాయల్ శంకర్ విమర్శించారు. రాష్ట్రస్థాయిలో బ్యాంకర్ల సమావేశం తర్వాత జిల్లాల స్థాయిలో బ్యాంకర్ల సమావేశాలు జరగలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News