- Advertisement -
నేనూ రేసులో ఉన్నా, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతా అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. పార్టీకి విధేయుడిగానే నేను పని చేస్తున్నాను, నేను కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి నేనూ అర్హుడినే అని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1995 నుంచి హిందూవాహిని కార్యకర్తగా కొనసాగుతున్నానని, అయితే 2009లో మంగళ్హట్ కార్పొరేషన్ సీటు ఇవ్వలేదని, అందుకే అప్పుడు టీడీపీ వెళ్లి టికెట్ తెచ్చుకుని గెలిచానని పేర్కొన్నారు. నామినేషన్ వేయడంపై తాను నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
- Advertisement -