- Advertisement -
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కెసిఆర్ కు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ నోటీసులు వ్యతిరేకిస్తూ.. బుధవారం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి మహాధర్నా నిర్వహించనున్నట్లు కవిత తెలిపింది. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మహాధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కవిత పిలుపునిచ్చారు.
కాగా, ఈనెల 5న విచారణకు హాజరుకావాలని కెసిఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాను 11వ తేదీన విచారణకు హాజరవుతానని కమిషన్ కు కెసిఆర్ విజ్ఞప్తి చేయగా.. అందుకు పిసి ఘోష్ కమిషన్ అంగీకరించింది.
- Advertisement -