Friday, May 30, 2025

నాజోలికి వస్తే బాగుండదు.. బిఆర్ఎస్ కు కవిత వార్నింగ్

- Advertisement -
- Advertisement -

ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా? అంటూ పరోక్షంగా మాజీ మంత్రి కెటిఆర్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నానని.. కానీ, కెసిఆర్ వద్దని వాదించారని చెప్పారు. లీకువీరులను పట్టుకోమంటే.. గ్రీకువీరులు దండెత్తారుని.. తన జోలికి వస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ మునిగిపోయే నావ అని కవిత అన్నారు. 2013లో కాంగ్రెస్‌తో మాట్లాడానని.. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదని తెలిపారు.

“కెసిఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కెసిఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు. నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు. పార్టీ సోషల్‌ మీడియాలో నన్ను టార్గెట్‌ చేశారు. నా లేఖ లీక్‌ చేసిందెవరో చెప్పాల్సిందే.కెసిఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు. ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా. నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నా. పార్టీలో కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కనపెట్టడం లేదు. బిఆర్ఎస్‌లో కెసిఆర్‌ ఒక్కరే నాయకుడు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను” అని కవిత పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News