Friday, June 27, 2025

చంద్రబాబుకు బిర్యానీ తినిపించి గోదావరి నీళ్లను గిఫ్ట్‌గా ఇచ్చారు

- Advertisement -
- Advertisement -

2024 జూలై 6వ తేదీన ప్రజాభవన్‌లో రేవంత్ రెడ్డితో సమావేశమైన తర్వాతే చంద్రబాబు నాయుడు పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. 2016లో పోలవరం నుంచి బనకచర్ల లింక్ అనే ప్రాజెక్టు ప్రస్తావనే లేదన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారంతో కెసిఆర్‌పై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా పోలవరం – బనకచర్లపై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేయడం లేదని, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించి గోదావరి నీళ్లను గిఫ్ట్ ప్యాక్‌గా ఇచ్చారని విమర్శించారు.

ఆంధ్రా బిర్యానీ ఎట్లా ఉంటుందో గతంలోనే కెసిఆర్ చెప్పారని అన్నారు. పోలవరం ముంపు సమస్యను చర్చించేందుకు కేంద్రం ప్రగతి ఎజెండాలో చేర్చి చివరి నిమిషంలో చర్చను ఎత్తివేసిందని మండిపడ్డారు. భద్రాచల రాముడు పోలవరంలో మునుగుతున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బిజెపి ఎంపీలు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు వెంటనే తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పూణే మెట్రో రైల్‌కు కేంద్ర కేబినెట్‌లో రూ.3,500 కోట్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బిజెపి ఎంపీలకు నిధులు తెచ్చే సత్తా లేదని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News