Saturday, September 13, 2025

మహిళా సాధికారికత… నేపాల్ ప్రధాని సుశీలా కార్మికి మోడీ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ ః మణిపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇంఫాల్ సభ నుంచే నేపాల్ నూతన ప్రధాని సుశీలా కార్కికి శుభాకాంక్షల సందేశం వెలువరించారు. ఇరు దేశాల మధ్య చిరకాలపు చరిత్ర, విశ్వాసం, సాంస్కృతిక పలు ప్రత్యేకతల బంధం ఉందని చెప్పారు. నేపాల్‌లో తొలిసారిగా మహిళా ప్రధాని బాధ్యతలు స్వీకరించడం నేపాల్ మహిళా సాధికారికత వెల్లివిరిసిన ఘట్టానికి తార్కాణం అన్నారు. నేపాల్ పరివర్తన దశలో భారత్ ఎల్లవేళలా తోడుగా నిలిచిన విషయాన్ని ఈ నేపథ్యంలో ప్రధాని గుర్తు చేశారు.

140 కోట్ల మంది భారతీయుల తరఫున తాము నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. నేపాల్‌లో శాంతి సుస్థిరత సౌభాగ్యం నెలకొనేలా చేయడంలో ఈ మాజీ ప్రధాన న్యాయమూర్తి తమ నాయకత్వ లక్షణాలతో విజయం సాధిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. నేపాల్‌కు సంఘీభావంగా ఉంటామని, మరింతగా కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు. నేపాల్ ప్రజాస్వామిక పయనంలో భారత్ మిత్రపక్ష పాత్ర ఎప్పుడూ ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News