Monday, June 2, 2025

ఆ కోరిక అలాగే మిగిలిపోయింది: మోహన్‌బాబు

- Advertisement -
- Advertisement -

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’. మంచు మోహన్ బాబు సమర్పణలో ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా రూపొందించారు. అన్ని చిత్ర పరిశ్రమల నుంచి అగ్ర నటులు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ తదితరులు ఈ మూవీలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. కన్నడలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందని.. కానీ ఆ కోరిక అలాగే మిగిలిపోయిందన్నారు. రాజ్‌కుమార్‌, అంబరీష్‌లతో సినిమా చేయాలని ఉండేదని.. కానీ కుదరలేదని చెప్పారు. శివరాజ్‌కుమార్ తన చిత్రంలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని మోహన్‌బాబు అన్నారు. కాగా, మేకర్స్ ఓ వైపు ప్రమోషన్స్ చేస్తుండగా.. మరోవైపు, ఆ సినిమాకరు సంబంధించిన హార్డ్ డ్రైవ్ మిస్సైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News