Friday, June 6, 2025

జులై 21 నుంచి పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ బుధవారం విలేకరులకు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ తేదీలను సిఫార్సు చేసిందని,ఈ మేరకు సమావేశాలను ఖరారు చేశామని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్ ఇతర వీషయాలను చర్చించేందుకు వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఏర్పాటు జరగాలని ప్రతిపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ దశలోనే విపక్షాల డిమాండ్ గురించి ఏమి చెప్పకుండా ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను వెల్లడించింది. మరి ప్రతిపక్షాల డిమాండ్ గురించి ఏం చెపుతారు? అని విలేకరులు ప్రశ్నించగా , అన్ని విషయాలను పార్లమెంటరీ నిబంధనల మేరకు వర్షాకాల సమావేశాల్లోనే చర్చించవచ్చునని మంత్రి జవాబు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News