Wednesday, June 11, 2025

త్వరలో మార్కెట్లోకి మోటరోలా కొత్త ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5500ఎంఏహెచ్..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ మోటరోలా కొత్త 5G ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రానున్నది. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, మోటో ఎడ్జ్ 60 ప్రో ఫోన్స్ విడుదల తర్వాత కంపెనీ మోటో ఎడ్జ్ 60ని లాంచ్ చేసింది. భారత మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ధర
భారత్ లో మిడ్-రేంజ్ ఫోన్‌గా లాంచ్ అయినా మోటో ఎడ్జ్ 60 5G ఫోన్ 12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా మోటరోలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా అధికారిక పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. ఈ ఫోన్ అమ్మకం జూన్ 17, 2025న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫర్‌ల కింద డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. కాగా యాక్సిస్ బ్యాంక్, IDFC బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.

స్పెసిఫికేషన్లు

మోటరోలా ఎడ్జ్ 60 పంచ్-హోల్ కటౌట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 1.5K క్వాడ్ కర్వ్డ్, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌తో ఉంది. హలోయుఐ స్కిన్ ఆధారంగా ఆండ్రాయిడ్ 15పై పనిచేసే ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంది. AI ఫీచర్లు, WiFi 6, బ్లూటూత్ వెర్షన్ 5.4 లకు కూడా మద్దతు ఇస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 60 లో మూడు కెమెరా సెటప్ లు ఉన్నాయి. దీనికి ప్రధాన కెమెరా సెటప్ ఉంది – 50 మెగాపిక్సెల్స్, రెండవ కెమెరా 3x జూమ్‌తో 50 మెగాపిక్సెల్స్, ఇక మూడవది 10 మెగాపిక్సెల్స్. ఇక సెల్ఫీల వీడియో కాలింగ్ కోసం..ఈ ఫోన్ లో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. బ్యాటరీ గురించి మాట్లాడుతే.. మోటరోలా కొత్త ఎడ్జ్ 60 శక్తివంతమైన 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News